నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం

నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం

నాగరం, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)

“నశా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా జెడ్ పిహెచ్ఎస్ నాగరం పాఠశాలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి మత్తు పదార్థాల ఉపయోగాన్ని పూర్తిగా నిరోధించే దిశగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో నాగరం మునిసిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, మేనేజర్ బి. నారాయణ రెడ్డి, వార్డు అధికారులు, యుఎల్‌బి సిబ్బంది పాల్గొన్నారు. నశా ముక్త్ భారత్ లక్ష్య సాధనకు విద్యార్థులు, ప్రజలు కలిసి ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు వ్యక్తి ఆరోగ్యాన్ని, కుటుంబ స్థిరత్వాన్ని, సమాజ శాంతిని దెబ్బతీసే ప్రమాదం ఉన్నందున వాటి నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన సూచించారు.మత్తుమందుల రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుIMG-20251119-WA0281కు చేపట్టిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు చురుకైన స్పందన చూపించారు. ఈ తరహా అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!