ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు.

ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.

హాసన్ పర్తి, నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):

విలీన గ్రామాల అభివృద్ధే ద్వేయంగా ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులుకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామ స్మశాన వాటికలో మౌలిక వసతుల అభివృద్ధి పనులకోసం బుధవారం రోజున 18లక్షల నిధులతో అభివృద్ధి పనులు ఎమ్మాల్యే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్మశాన వాటికలు కూడా ప్రజా జీవనంలో ఒక ముఖ్యమైన భాగమని ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు, విద్యుత్, కూర్చునే సదుపాయం, షెడ్లు, టాయిలెట్లు వంటి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రజల సమస్యలు విని పరిష్కరించడం నా బాధ్యత అని  అందరి ఆశీర్వాదాలతో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తానుని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!