మల్లెమడుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఖమ్మం బ్యూరో,నవంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;
ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు నవంబర్ 14 న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం పేరెంట్ టీచర్ మీటింగ్ తో కలిపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె .సాంబమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఇందులో బాలికల అక్రమ రవాణా అనే నాటిక ఎంతో ఆకట్టుకుంది, దేశ నాయకుల వేషధారణ ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయని వారు తెలియజేశారు, ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ వకృత్వ సాంస్కృతిక దేశ నాయకుల వేషధారణ లలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments