పదిహేనేళ్లుగా పెండింగ్‌ లో ప్లాట్లు...భూమి హద్దుల కోసం నాగారం లబ్ధిదారుల పోరాటం

నాగారం, నవంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలం నాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 84/2, 85/2, 86/2, 87/2లో గల మొత్తం 330 ప్లాట్లకు సంబంధించిన భౌతిక పొజిషన్ ఇవ్వాలని లబ్ధిదారులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.2009 ఫిబ్రవరి 2వ తేదీన బి/2006/2006 నంబర్‌తో అప్పటి  పార్లమెంట్ సభ్యులు సర్వే సత్యనారాయణ  లబ్ధిదారులకు 60 గజాల ప్లాట్లకు పట్టా సర్టిఫికేట్‌లు అందజేశారు. కానీ అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా భూమిపై పొజిషన్ చూపించక పోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు బొలారం ఎల్లమ్మ, పంగ మంజుల, వై. సంగీత, అయ్యాగల్ల భాగ్యమ్మ, కిష్టా వరలక్ష్మి, జి. హేమలత, బాస భాగ్యరేఖ, ఎ. బాగ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ—“మాకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నా భూమిపై యాక్సెస్ లేదు. ఎక్కడ మా ప్లాట్ ఉందో తెలియక నిర్మాణం కూడా చేపట్టలేము. పదేళ్లకు పైగా అధికారులు, గ్రామపంచాయతి, రెవెన్యూ శాఖ చుట్టూ తిరుగుతున్నాం. ఇప్పుడు కలెక్టర్  మా సమస్యను పరిష్కరించగలరు” అని ఆవేదన వ్యక్తం చేశారు.ప్లాట్లకు సంబంధించిన వివరణాత్మక పత్రాలను కలెక్టర్ కార్యాలయానికి అందజేసిన లబ్ధిదారులు, రెవెన్యూ శాఖ లోనే భూమి హద్దులను చూపించి, పట్టా ప్రకారం పొజిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.గ్రామ ప్రజలు కూడా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పరిపాలనను కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!