మహాసభలను జయప్రదం చేయాలి.!

మహిళా హక్కుల పరిరక్షణకు ఐద్వా పిలుపు.

మహాసభలను జయప్రదం చేయాలి.!

సత్తుపల్లి, నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక పట్టణంలో రావి వీర వెంకయ్య భవనంలో ఐద్వా డివిజన్ కమిటీ సమావేశం చెరుకు రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి మాట్లాడుతూ, మహిళలపై హింస, దాడులు, అత్యాచారాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అనుమతిస్తోన్న మద్యం, మాదక ద్రవ్యాలే మహిళలపై దాడులకు కారణమవుతున్నాయని చెప్పిన ఆమె, వీటిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలిగేలా ఫ్రీ బస్ సర్వీసులను పెంచాలని, అలాగే మహిళలకు ఇస్తామని ప్రకటించిన రూ.2500 సహాయాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు శీలం కరుణ మాట్లాడుతూ, జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిలభారత మహాసభలను విజయవంతం చేయడానికి గ్రామాల వారీగా ఐద్వా జెండా ఆవిష్కరణలు నిర్వహించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సహాయ కార్యదర్శి జాజిరి జ్యోతి, మిట్టపల్లి నాగమణి, రాణి రుద్రమ్మదేవి, పెరసాని లలిత, భూలక్ష్మి, కరిష్మా, ప్రభావతి, కే.వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!