రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

కాప్రా, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. పార్కులో ఏర్పాటు చేస్తున్న గ్రీనరీ పనులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, పార్కు నిర్మాణాలు వీలైనంత త్వరలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, పదికాలాల పాటు నిలబడేలా నాణ్యమైన నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు.ఇటీవల పార్కులో పాడైన పరికరాల స్థానంలో కొత్త ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్లు, చెట్ల చుట్టుపక్కల ఉన్న ఆకులు, కొమ్మలను తొలగించి పార్కును శుభ్రపరిచినట్లు వివరించారు. పచ్చదనం కనువిందుగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పార్కును పూర్తిగా అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ హార్టికల్చర్ అశోక్, సాయి కుమార్, పూస రమేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్