దాన్యం కొనుగోలు కేంద్రంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసినారు

దాన్యం కొనుగోలు కేంద్రంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసినారు

మేడ్చల్ మల్కాజ్గిరి, నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు)

శామిరపేట్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు జిల్లా కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ తనిఖీలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎల్. సుగుణబాయి, డీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, డీసీఓ వెంకట్ రెడ్డి, ఏఈఓ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు వడ్లను తడి, తాలు, దుమ్ము లేకుండా శుభ్రపరచి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వరి నూర్పిడి యంత్రాల నిర్వాహకులతో మాట్లాడి వరికోత సమయంలో ధాన్యం క్రమబద్ధంగా కొనుగోలు కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి తగిన హమాలీలను ఏర్పాటు చేయాలని, వడ్లు దింపుకునే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోలు కేంద్రంలో త్రాగునీటి సదుపాయం కల్పించాలని ఇన్‌చార్జ్‌కి ఆదేశించారు.కొనుగోలు చేసిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్‌లో ఆన్లైన్‌గా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యం అమ్మిన 48 గంటలలోపే డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అదనపు కలెక్టర్ తెలిపారు.IMG-20251121-WA0160

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్