జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలి ఎమ్మెల్యేకు వినతి పత్రం
Views: 7
On
కాప్రా, డిసెంబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలనే డిమాండ్ తో జమ్మిగడ్డ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి, జమ్మిగడ్డను ప్రత్యేక డివిజన్గా ప్రకటించాలని సాధన సమితి నేతలు వినతి పత్రం అందజేశారు.అనంతరం సాధన సమితి ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్, మేయర్లకు కూడా వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం జమ్మిగడ్డ ప్రాంతం పలు డివిజన్లలో విభజించబడటం వల్ల అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. జమ్మిగడ్డలోని అన్ని కాలనీలను ఒకే డివిజన్గా కలిపి ప్రత్యేక డివిజన్గా ఏర్పాటు చేయాలని వారు కోరారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Dec 2025 18:33:29
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...


Comments