జిల్లా పరిషత్ భవనంలో అదనపు నిర్మాణాల పైఅంచనాలుపంపాలని అధికారులకు ఆదేశం

జిల్లా కలెక్టర్ మను చౌదరి

జిల్లా పరిషత్ భవనంలో అదనపు నిర్మాణాల పైఅంచనాలుపంపాలని అధికారులకు ఆదేశం

మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ మండలంలో జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయ భవనాన్ని జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు కేటాయించే అంశంపై జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి జిల్లా పరిషత్ సీఈఓ కార్యాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ భవనంలోని మొదటి అంతస్తులో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేయడం, పక్కనే ఉన్న ఎంపీడీఓ కార్యాలయాన్ని మండల తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించే ప్రతిపాదనలను కలెక్టర్ పరిశీలించారు.అలాగే జిల్లా పరిషత్ కార్యాలయంలో ని రెండో అంతస్తు భవనంపై పైకప్పు స్లాబ్ నిర్మాణానికి అయ్యే వ్యయంపై అంచనాలు తయారు చేసి నివేదిక సమర్పించాలని పంచాయతీరాజ్ ఏఈను ఆదేశించారు. పక్కనే ఖాళీగా ఉన్న స్థలంలో జీ ప్లస్ వన్ కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన వ్యయ అంచనాల నివేదికను కూడా పంపాలనిసూచించారు. IMG-20251217-WA0076ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ కాంతమ్మ కార్యాలయ గదులు, మీటింగ్ హాళ్లు, సమీపంలోని ఖాళీ స్థలాన్ని కలెక్టర్‌కు చూపించి వివరించారు. అనంతరం కలెక్టర్ శామీర్‌పేట్‌లోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .