బేతుపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రభంజనం.!

బేతుపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రభంజనం.!

సత్తుపల్లి, డిసెంబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దొడ్డా రాజేంద్ర ప్రసాద్ (అమ్ములు) ఘన విజయాన్ని సాధించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొని ఆయన 1100 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా, గ్రామంలోని మొత్తం 12 వార్డులను తన పక్షాన కైవసం చేసుకోవడం ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పార్టీ టికెట్ లభించకపోయినా, ప్రజల మధ్య ఉండే నాయకుడిగా పేరుపొందిన రాజేంద్ర ప్రసాద్‌పై గ్రామ ప్రజలు అపార విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, పారదర్శక పాలన, గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సాగిన ప్రచారానికి ప్రజలు తమ ఓటుతో స్పష్టమైన మద్దతు పలికారు.

డబ్బు, పార్టీ ప్రభావాలకు లోబడకుండా స్వతంత్ర ఆలోచనతో ఓటు వేసిన బేతుపల్లి ప్రజలు ఈ ఎన్నికల్లో నిజాయితీ రాజకీయాలకు పట్టం కట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫలితం గ్రామ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తుందని, భవిష్యత్ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని వారు పేర్కొంటున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ మృతుల కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ
ఖమ్మం బ్యూరో డిసెంబర్ 18(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కాంగ్రెస్...
బాధ్యతాయుత జర్నలిజమే లక్ష్యం
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది
కుషాయిగూడ డివిజన్ ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రలు 
పీచరలో కూరగాయల మార్కెట్‌కు స్థల పరిశీలన
నూతనంగా ఎన్నికైన అయ్యవారిపల్లె, పెద్ద మునగల్ షెడ్ సర్పంచులకు ఘన సన్మానం 
ఎన్నికల విధుల్లో అకాల మరణం పొందిన వెంకటాపురం ఎంపీడీవో రాజేంద్రప్రసాద్