ఆసక్తికరంగా మారిన మద్దిగట్ల పంచాయతీ వార్

1705 ఓటర్లకు 9 మంది సర్పంచ్ అభ్యర్థులు

ఆసక్తికరంగా మారిన మద్దిగట్ల పంచాయతీ వార్

పెద్దమందడి,డిసెంబర్05(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి జోరుగా సాగుతుంది.ఎవరికి వారు యమున తీరలాగా ఉన్నారు.పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ పంచాయతీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ 1705 ఓట్లు ఉండగా, సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఏకంగా తొమ్మిది (9) అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలబడ్డారు.నువ్వా - నేనా అంటూ పోటీ.పెద్దమందడి మండలంలో స్వల్ప అధిక ఓట్లు కలిగిన గ్రామ పంచాయతీలలో మద్దిగట్ల కూడా ఒకటి. ఇక్కడ ఏ మాత్రం కూడా తీసిపోని విధంగా ఉంది. ప్రధానంగా అధికార పార్టీకి అభ్యర్థులు మద్దతిస్తున్న, అధిక సంఖ్యలో సర్పంచ్ అభ్యర్థులు 
గెలుపు ముఖ్య కీలకం. ఓట్ల చీలిక అంశం సర్పంచ్ అభ్యర్థినీ ప్రభావితం చేసేలా ఉందనీ అనడంలో అతిశయోక్తి లేదు.అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల,ఓట్లు ఎక్కువగా చీలిపోయే అవకాశం ఉంది.దీంతో స్వల్ప ఆధిక్యంతో గెలుపోటములు నిర్ణయించే అవకాశం ఉంది.లేకపోతే యువత ఓట్లు చీల్చి దాదాపు 350 పై చీలుకు ఓట్లు ఓటర్ల ద్వారా రాబడితే గెలుపు దిశలో ఉంటారని ఓటర్లు ఆకాంక్షిస్తున్నారు.గ్రామ ప్రధాన సమస్యలు గ్రామంలో 11 కేవీ విద్యుత్ వైర్ల వల్ల కాలనీవాసులకు సమస్యగా మారడం, గ్రామ వైకుంఠ ధామం వర్షాకాలంలో చనిపోయిన వారిని పూడ్చడానికి చెరువు నీళ్ల వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉండడం,చెత్త డంపింగ్ యార్డు శాశ్వత రాకపోకల మార్గానికి పరిష్కారంగా ప్రధాన సమస్యలుగా గ్రామంలో నెలకొన్నాయి.అభ్యర్థులు వీటిని దృష్టిలో ఉంచుకోని ప్రచారంలో ప్రజలకు వారు గతంలో చేసిన సేవలు ముందు చేయబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.మద్దిగట్ల గ్రామ జనాభాలో 1705 ఓట్లు వున్న వారిలో యువత ఓటు బ్యాంకు అధికం ఉండడం చేత వారి   ఓట్లు ఎవరు చీల్చి అధిక ఓట్లు తెచ్చుకోగలుతారో వారి ఓట్లే గెలుపునకు కీలకంగా కానున్నారు. ఈ ఎన్నికల్లో మద్దిగట్ల గ్రామ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఈ తొమ్మిది మంది సర్పంచ్ అభ్యర్థుల బరిలో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవడానికి అదృష్టవంతులు ఎవరో తేలాలంటే ఎన్నికల జరుగు రోజు వరకు వేచి ఉండక తప్పదు.మద్దిగట్ల గ్రామ పంచాయతీ ఫలితాలు గ్రామ రాజకీయాలు పెద్దమందడి మండలంలో గ్రామంలో సర్పంచ్ పీఠం అందరిని ఆసక్తి రేపుతూ ఒకే సారి సర్పంచ్ పీఠానికి 19 మంది పోటీ చేయగా నేడు 9 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .