శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 

శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి 

-హతీరామ్ బావాజీ మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలి 

-కేంద్రాన్ని కోరిన ఎంపీల బృందం 

న్యూ ఢిల్లీ,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

లోక్‌సభ భవనంలో కేంద్ర సంస్కృతి శాఖ మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించిన అనంతరం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆచార్య అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్, జీ నాగేష్ పార్లమెంట్ సభ్యులతో కలిసి శ్రీ హతీరామ్ బావాజీ మఠానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. మఠానికి స్పష్టమైన పరిపాలనా వ్యవస్థ ఏర్పడితే సంప్రదాయాల పరిరక్షణతో పాటు భక్తుల విశ్వాసానికి భరోసా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారిక జయంతిగా ప్రకటించి దేశవ్యాప్తంగా నిర్వహించాలని వినతిపత్రంలో డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. ఈ జయంతి అధికారికంగానిర్వహించటం ద్వారా ఆయన సేవలు, బోధనలు దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు చేరువవుతాయని తెలిపారు.IMG-20251218-WA0060 ఈ రెండు అంశాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .