సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం

పౌల్ట్రీ ఫామ్ సూపర్‌వైజర్‌కు తీవ్ర గాయాలు

వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన షాతావాహన పౌల్ట్రీ ఫామ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మేకల శ్రీకాంత్ విధుల నిమిత్తం వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని డీసీఎం వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తలతో పాటు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు): వేలేరు మండలం పీచర గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత...
సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం
చిన్నారులను ఆశీర్వదించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో భూక్య వీరస్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం..
మీడియా పట్ల వివక్ష సరికాదు
కామ్రేడ్ భూక్య వీరస్వామికి ఘన నివాళులు
ఈ నెల 20న తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ