సోడాషాపల్లి శివారులో వ్యక్తిని ఢీకొన్న డీసీఎం

పౌల్ట్రీ ఫామ్ సూపర్‌వైజర్‌కు తీవ్ర గాయాలు

వేలేరు,డిసెంబర్18(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన షాతావాహన పౌల్ట్రీ ఫామ్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మేకల శ్రీకాంత్ విధుల నిమిత్తం వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని డీసీఎం వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌కు తలతో పాటు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .