సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం

మందుముల పరమేశ్వర్‌రెడ్డి

సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరం

ఉప్పల్, డిసెంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):

సీఎంఆర్ఎఫ్ పేదలు, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి మందుముల పరమేశ్వర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్ఎఫ్ కింద వైద్య బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరమేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మికి రూ.26 వేలు, సహినా సుల్తానాకు రూ.57 వేలు, నరసింహకు రూ.25 వేలు, సక్కుబాయి తరణికి రూ.41 వేలు చొప్పున మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు చెన్‌రెడ్డి రఘుపతి రెడ్డి, ఆగం రెడ్డి, ఈగ ఆంజనేయులు ముదిరాజ్, రామంతపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎండి.రఫిక్, హెచ్.ఆర్.మోహన్, బజార్ నవీన్ గౌడ్, బుల్లెట్ అశోక్, అఫ్జల్, వహీద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .