ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు
Views: 14
On
నాచారం, జనవరి 18 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్బీ కాలనీలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడు ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు రామ్ ప్రదీప్ మునుగంటి, బ్రహ్మచారి, తిమ్మారెడ్డి, వీరభద్రరావు, ప్రసాద్, సాంబ, సాయి, మురళి తదితర నాయకులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు హాజరై ఘన నివాళులు అర్పించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments