మే డే వాల్ పోస్టర్ విడుదల

ఘట్టమ్మ జిపి మండల అధ్యక్షురాలు పెద్దమందడి

మే డే వాల్ పోస్టర్ విడుదల

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:

వనపర్తి జిల్లా, పెద్దమందడి మండల కేంద్రంలో మే 1 న, 139 వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే ను, ఒక పండుగలా కాకుండా దీక్ష దినంగా జరుపుకోవాలని పెద్దమందడి జీపీ కార్మికుల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మే డే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాద దోపిడీదారులు అణిచివేతలు, వివేక్షకులకు వ్యతిరేకంగా పోరాడుతూ, వర్గ ఐక్యత సాధించి వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని, కార్మిక వర్గ ప్రతిఘటన వల్ల నే ఎనిమిది గంటల పని దినం చట్టం చేయబడిందన్నారు. 139 సంవత్సరాల క్రితం 10 గంటల నుండి 16 గంటలు వరకు పని దినముంటే, దాన్ని తగ్గించుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలు సైతం త్యాగం చేశారు ఆనాటి మన పోరాట యోధులు అని అన్నారు. మేడే 1 నా, జరిగే జెండా కార్యక్రమంలో, పెద్దమందడి మండల పరిధిలోని అన్ని గ్రామాల కార్మికులు, జెండావిష్కరణలో పాలుపంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో, పెద్దమందడి మండల జిపి కార్మికుల విభాగం అధ్యక్షురాలు ఘట్టమ్మ, వెంకటమ్మ, సుందరయ్య, ఆంజనేయులు, కురుమన్న, బి.నిరంజన్, వాసన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .