మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర

మృతుల కుటుంబాలను పరామర్శించిన సింగపురం ఇందిర

IMG-20250326-WA0044

.రఘునాథపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నేతల కుటుంబాలను కాంగ్రెస్ ఎప్పుడూ ఆదుకుంటుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేషన్‌గంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సింగపురం ఇందిర అన్నారు.

జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ రెడ్డి తండ్రి లింగాల నరసింహారెడ్డి, కాంగ్రెస్ నేత జోగారెడ్డి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఇబ్రహింపురానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసింహారెడ్డి, జోగారెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తూ, కాంగ్రెస్ పార్టీకి అందించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అంతేగాక, రఘునాథపల్లి మండలానికి చెందిన కంచనపెల్లి పిఎసిఎస్ చైర్మన్ చీమలపాటి రవీందర్, నారాయణపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజిగొల్లూరి ఐలయ్య మరణించడంతో, వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ఎలాంటి అవసరమైనా కాంగ్రెస్ పార్టీ వెన్నుతట్టిపోతుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .