అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

పటాన్‌చెరు ఎంఈఓకు వినతిపత్రం అందజేసిన నవభారత్ నిర్మాణ్ యువసేన ప్రతినిధి

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

పటాన్‌చెరు, తెలంగాణ ముచ్చట్లు:

పటాన్‌చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్ నిర్మాన్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ మండల విద్యాశాఖాధికారి నాగేశ్వర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ప్రైవేట్ పాఠశాలలు 2009 విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ అడ్మిషన్, డొనేషన్ పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు కూడా అధిక ధరలకు అమ్ముతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలల వీలుచూసే ధరల విధానం, ప్రభుత్వ పాఠశాలల వైపు ఆసక్తి తగ్గేలా ప్రభావం చూపుతున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను మండల విద్యాశాఖాధికారికి తెలియజేశామని, తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బలోపేతం చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల పోటీ ధోరణికి ప్రత్యామ్నాయం కట్టుబట్టేలా చర్యలు చేపట్టాలని మెట్టు శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
పటాన్‌చెరు, తెలంగాణ ముచ్చట్లు: పటాన్‌చెరు మండల పరిధిలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ నవభారత్...
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా 
అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పదవి మాదిగలకు దక్కిన గౌరవం  
ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని జశ్విత
అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం