జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా
వోల్క్స్ స్పెల్లింగ్ బీ పోటీలో పలు బహుమతులు అందుకున్న విద్యార్థులు
ఖాజీపేట్,తెలంగాణ ముచ్చట్లు:
జూన్ 8న నిర్వహించిన వోల్క్స్ స్పెల్లింగ్ బీ నేషనల్ కాంపిటీషన్ 2025లో (కాజీపేట) ఫాతిమానగర్ చెందిన మాంట్ ఫోర్ట్ సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఘన విజయాలను అందుకున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో పాఠశాల విద్యార్థులు మూడు విభాగాల్లో ద్వితీయ మరియు తృతీయ బహుమతులను గెలుచుకొని అందరినీ ఆకట్టుకున్నారు.
మూడో తరగతిలో చదువుతున్న ఎం. చరణ్ క్యాటగిరి 1లో ద్వితీయ బహుమతి, ఆరో తరగతికి చెందిన అంకిత హెల్డర్ క్యాటగిరి–3లో ద్వితీయ బహుమతిని పొందారు. ఎనిమిదో తరగతి విద్యార్థిని ఆర్. శరయు రెడ్డి క్యాటగిరి–4లో తృతీయ బహుమతి సాధించింది. విజేతలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున నగదు బహుమతులు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేయబడ్డాయి.
విజయోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెవరెండ్ బ్రదర్ జి. విన్సెంట్ రెడ్డి, స్పెల్లింగ్ బీ ఇంచార్జ్ టీచర్ కరిష్మా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. వారు ఈ విజయాన్ని పాఠశాల ఖ్యాతిని పెంచిన ఘనతగా పేర్కొన్నారు.
Comments