అధైర్య పడాల్సిన అవసరం లేదు సముచిత స్థానం కల్పిస్తాం
సింగపురం ఇందిరకు,రాష్ట్ర ఇంచార్జ్ నటరాజన్ మీనాక్షి భరోసా
-సింగపురం ఇందిరకు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు
-మీనాక్షి నటరాజన్ ను కలిసిన సింగపురం ఇందిరా
స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్గా నిబద్ధతతో పనిచేస్తున్న సింగపురం ఇందిర, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆహ్వానంపై హైదరాబాద్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పట్ల నిస్వార్థంగా శ్రమిస్తున్న కార్యకర్తల గొంతుకగా ఆమె ఈ సమావేశంలో స్పష్టంగా తన అభిప్రాయాలను వినిపించారు.
గత పదేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, పార్టీ వితరణను కాపాడుతూ, ప్రజల్లో నమ్మకం పెంచుతూ, 30 వేల ఓట్లతో ఉన్న బలాన్ని 95 వేల ఓట్లకు చేర్చిన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పునాదులను బలోపేతం చేయడంలో ఆమె పోషించిన పాత్రను వివరించడమే కాకుండా, ఎన్నికల తర్వాత జరిగిన మార్పులు–చేర్పులపై కూడా స్పష్టమైన అవగాహనతో స్పందించారు.
సమావేశానంతరం మీనాక్షి నటరాజన్, సింగపురం ఇందిర చూపిన నిబద్ధతను ప్రశంసిస్తూ, పార్టీ పట్ల పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగేలా చూస్తామని, ఆమె వంటి సమర్థవంతమైన నాయకులకు పార్టీ అండగా ఉండటమే కాకుండా, రాబోయే రోజుల్లో పూర్తి మద్దతుగా నిలబడతామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గ పరిస్థితులపై వ్యక్తిగతంగా ఆరా తీసి, కార్యకర్తల భావాలను పట్టించి విన్న మీనాక్షి నటరాజన్కు సింగపురం ఇందిర కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అర్థవంతమైన ప్రతినిధిగా నిలిచే దిశగా ఆమె చేస్తున్న ప్రయాసలకు ఇది మరింత బలాన్నిస్తుంది.
Comments