రేపు నీట్ పరీక్ష

పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

రేపు నీట్ పరీక్ష

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

జిల్లాలో రేపు (ఆదివారం) జరగనున్న నీట్ పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న ఈ పరీక్షను పకడ్బందీగా చేపట్టేందుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నారు.

పరీక్ష నిర్వహణకు హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాల, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఆయా కేంద్రాలలో పరీక్ష కోసం చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు అక్కడ పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .