యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కుల కల్పనలో పాలకులు విఫలం

మత ఛాందసానికి వ్యతిరేకంగా యువత పోరాడాలి

యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కుల కల్పనలో పాలకులు విఫలం

-ఘనంగా ఎఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

-కల్లూరు ధర్మేంద్ర,ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
యువతకు విద్య, వైద్య, ఉపాధి హక్కులను కల్పించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర విమర్శించారు. మత ఛాందస విధానాలకు వ్యతిరేకంగా యువత కఠినంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ సత్యనారాయణరెడ్డి భవన్ వద్ద నిర్వహించిన ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో యువజన సంఘ జెండా ఎగురవేసి, దేశ సమైక్యత, సార్వభౌమాధికార రక్షణకు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ, దేశాన్ని పట్టిపీడించిన తెల్లదొరల్ని తరిమిన యువతనే, ఇప్పుడు నల్లదొరల దోపిడీకి ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. యువతలో అభ్యుదయ భావాల్ని, మానవత్వాన్ని, దేశభక్తిని పెంపొందించేందుకు ఎఐవైఎఫ్ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. 1959 మే 3న స్థాపితమైన ఎఐవైఎఫ్, అనేక ఉద్యమాల వేదికగా యువ హక్కుల సాధనకు పాటుపడుతోంది అన్నారు.

నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మతపరమైన విధానాల్ని ప్రోత్సహిస్తూ యువతను దారి తప్పిస్తోందని, ఆర్ఎస్ఎస్ విధానాల్ని దేశమంతటా మూడుమూళ్లుగా వ్యాపింపజేయడానికి కుట్రలు పన్నుతోందని ధర్మేంద్ర ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలపై దేశప్రజలంతా ఒక్కటై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

నిరుద్యోగంపై గంభీర ఆందోళన:
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. బాలకృష్ణ, కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం వచ్చిన 77 ఏళ్లైనా ప్రతి విద్యార్థికి విద్యార్హతకు తగ్గ ఉద్యోగం లభించకపోవడం దురదృష్టకరమన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగం 23.7 శాతానికి పెరిగిందని, ఇది యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోందని వివరించారు.

విద్యలో నాణ్యత తక్కువవడం, నైపుణ్యాల లోపం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వంటి అంశాలు నిరుద్యోగానికి కారణమవుతున్నాయని పేర్కొన్నారు. యువతకు స్థిర ఉపాధి అవకాశాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర యువజన విధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీమాన్, హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధు, కార్యదర్శి శివకుమార్, ఉపాధ్యక్షుడు మాజీద్ అలీ ఖాన్, సభ్యులు కళ్యాణ్, భరత్, సీపీఐ నాయకుడు చెట్టుకింది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం