బాసర ట్రిపుల్ ఐటీ తరలింపుపై సీఎంని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Views: 17
On
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)ను మహబూబ్ నగర్ జిల్లాలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం సందర్భంగా, జిల్లాకు చెందిన శాసనసభ్యులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్లోని నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, చిట్టెం పర్ణికా రెడ్డి, తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మహబూబ్ నగర్ జిల్లా విద్యారంగ అభివృద్ధికి ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments