ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం

జహీరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
 
ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. రంజుల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్,రవీందర్ రెడ్డి,బాబు,మాజీ ఎంపిటిసి ఖలీల్,నాయకులు చంద్రన్న, గుండారెడ్డి,రాజు,మల్లేష్, రవి,శశి,షబ్బీర్,మస్తాన్,  సర్దార్,ఎల్లారెడ్డి,మల్లారెడ్డి, దత్తు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్,ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం