ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం
జహీరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు. రంజుల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలు వినాయక,ఎం. భవాని, ఫర్హిన్ లకు యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ శాలువాలతో సన్మానం చేసి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు.భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులు చదివి, ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గ్రామస్తులంతా పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ వైజ్య నాథ్,రవీందర్ రెడ్డి,బాబు,మాజీ ఎంపిటిసి ఖలీల్,నాయకులు చంద్రన్న, గుండారెడ్డి,రాజు,మల్లేష్, రవి,శశి,షబ్బీర్,మస్తాన్, సర్దార్,ఎల్లారెడ్డి,మల్లారెడ్డి, దత్తు,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నానో సింగ్ రాథోడ్,ఉపాధ్యాయులు నరసింహారెడ్డి,నిజాముద్దీన్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments