సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం
వేద మంత్రోచ్చారణల మధ్య తొలి అక్షరాల దిద్దిన చిన్నారులు
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:
మండలంలోని రాయగుడెం గ్రామంలోని సరస్వతీ దేవాలయంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య, సంప్రదాయబద్ధంగా పిల్లలు అక్షరాల ప్రథమాంశాన్ని నేర్చుకున్న ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.
నూతన విద్యాసంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ మహోత్సవంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది సమిష్టిగా పాల్గొని పిల్లలకు శుభాశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,
“బాల్యంలోనే విద్యకు ఉన్న ప్రాధాన్యతను తెలిసేలా చేయాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. ఈ వయస్సులో విద్యారంభాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించడం చిన్నారుల్లో ఆసక్తిని పెంచుతుంది. బడులు తెరిచే రోజునే అక్షరభ్యాసం నిర్వహించడం అభినందనీయం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాన్ సింగ్, సీనియర్ ఉపాధ్యాయుడు పూల్ సింగ్, అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ప్రదిప, మహిళ సంఘ అధ్యక్షురాలు స్రవంతి, వి.ఓ చైర్మన్ రాజమ్మ, సీఆర్పి రనూప, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments