ఉప్పల్లో వైష్ణవి గ్రాండ్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం
తవిడబోయిన గిరిబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ మెయిన్ రోడ్లో నూతనంగా నిర్మించిన వైష్ణవి గ్రాండ్ ఫుడ్ కోర్ట్ భవనాన్ని రామంతపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తవిడబోయిన గిరిబాబు శనివారం భవ్యంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి తినేందుకు మంచి, శుభ్రమైన వాతావరణంలో ఉండే ఫుడ్ కోర్టుల అవసరం ఉందని, అలాంటి అవసరాన్ని తీర్చే విధంగా ఈ వైష్ణవి గ్రాండ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కుటుంబ సమేతంగా వస్తున్న వినియోగదారులకు రుచికరమైన భోజనాలను అందించడమే లక్ష్యంగా ఈ ఫుడ్ కోర్ట్ను అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపున విశిష్ట అతిథులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బజాజ్ జగన్నాథ్ గౌడ్, టీ. ప్రవీణ్, మైస నవీన్, బజార్ పద్మారావు గౌడ్, షామీర్పేట హనుమంత్ రెడ్డి, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments