పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది

పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు చంద్రారెడ్డి

పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది

కూకట్ పల్లి,తెలంగాణ ముచ్చట్లు:

కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్లోని ఫిలడెల్ఫియా ప్రార్థన మందిరంలో పది రోజులపాటు వి.బి.ఎస్,సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన  ర్యాలీలో పాపిరెడ్డినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఊట్ల చంద్ర రెడ్డి పాల్గొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, మంచి క్రమశిక్షణ,మంచి అలవాట్లు,దేవుని యందు భక్తి, తల్లిదండ్రులకు విధేయత,సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి విద్యార్థులుగా మంచి క్రమం నేర్చుకోవడానికి విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుందని పిల్లలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంఘకాపరి పాస్టర్ సల్మాన్, నాయకులు తెట్టెబావి ఆనంద్, సంఘపెద్దలు ఇజ్రాయిల్,రాజ్ కుమార్,బాలకృష్ణారెడ్డి, ప్రసంగి,ప్రేమయ్య,దయాకర్, కోర్ర్నేలు,కల్పన తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం