సాయిరాం నగర్‌లో రూ.64 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం

పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

సాయిరాం నగర్‌లో రూ.64 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:  చిలుకనగర్ డివిజన్‌లోని సాయిరాం నగర్ కాలనీలో రూ.64 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — ‘‘డివిజన్‌లో అన్ని కాలనీలు, బస్తీలకు అవసరమైన నూతన రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, టీఆర్‌ఎస్ నాయకులు కొకొండ జగన్ ముదిరాజ్, ఏదుల కొండల రెడ్డి, కొల్లూరి శ్యామ్, కాలనీవాసులు సుబ్బారావు, డాక్టర్ సురేష్ వర్మ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద...
మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన ఘటనలో 25 మంది రిమాండ్
కెసిఆర్,హరీష్ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా