సాయిరాం నగర్‌లో రూ.64 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం

పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

సాయిరాం నగర్‌లో రూ.64 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం

ఉప్పల్, తెలంగాణ ముచ్చట్లు:  చిలుకనగర్ డివిజన్‌లోని సాయిరాం నగర్ కాలనీలో రూ.64 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ — ‘‘డివిజన్‌లో అన్ని కాలనీలు, బస్తీలకు అవసరమైన నూతన రోడ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెల గౌడ్, ఏఈ రాధిక, టీఆర్‌ఎస్ నాయకులు కొకొండ జగన్ ముదిరాజ్, ఏదుల కొండల రెడ్డి, కొల్లూరి శ్యామ్, కాలనీవాసులు సుబ్బారావు, డాక్టర్ సురేష్ వర్మ, సత్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .