చలివేంద్ర ప్రారంభించిన రవికుమార్ యాదవ్

చలివేంద్ర ప్రారంభించిన రవికుమార్ యాదవ్

కూకట్‌పల్లి, తెలంగాణ ముచ్చట్లు:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ 123 పరిధిలో జాతీయ రహదారి వద్ద కళామందిర్ బస్ స్టాప్‌లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీరూ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వీరి ఆహ్వానంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి పౌరులకు నీటిని అందించారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, “వేసవి తీవ్రత మధ్య రహదారిపై ప్రయాణించే బాటసారులకు ఈ చలివేంద్రం ఉపశమనం కలిగిస్తుంది. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలి,” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీసీ మోర్చా, ఏసీ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక తాటికాయలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
-అధ్యక్షులుగా ఎర్ర రవీందర్,గౌరవ అధ్యక్షులుగా బొల్లెపాక నగేష్  ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  మండలంలోని తాటికాయల గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు జెండా గద్ద...
మహిళను వివస్త్రను చేసి,దాడి చేసిన ఘటనలో 25 మంది రిమాండ్
కెసిఆర్,హరీష్ సంతకాలే తెలంగాణకు మరణ శాసనం
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
ప్రైవేట్ పాఠశాలలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
సరస్వతి ఆలయంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అక్షరాభ్యాసం 
జాతీయ స్థాయిలో మాంట్ ఫోర్ట్ విద్యార్థుల ప్రతిభా