చలివేంద్ర ప్రారంభించిన రవికుమార్ యాదవ్

చలివేంద్ర ప్రారంభించిన రవికుమార్ యాదవ్

కూకట్‌పల్లి, తెలంగాణ ముచ్చట్లు:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ 123 పరిధిలో జాతీయ రహదారి వద్ద కళామందిర్ బస్ స్టాప్‌లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీరూ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వీరి ఆహ్వానంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి పౌరులకు నీటిని అందించారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, “వేసవి తీవ్రత మధ్య రహదారిపై ప్రయాణించే బాటసారులకు ఈ చలివేంద్రం ఉపశమనం కలిగిస్తుంది. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలి,” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీసీ మోర్చా, ఏసీ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం