వికలాంగులకు అండగా ఎమ్మెల్యే నాగరాజు

వికలాంగుల కాలనీకి రూ.1.5 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

వికలాంగులకు అండగా ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కొనసాగింపులో భాగంగా ఆదివారం 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి వికలాంగుల కాలనీలో రూ.1.5 కోట్ల సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ఒక్క రోజులోనే రూ.2.5 కోట్ల విలువైన డ్రైనేజీ, రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం అభివృద్ధిపట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని” పేర్కొన్నారు. ప్రారంభించిన ప్రతీ పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

గత 15 నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికీ మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల అంచనాలకు తగిన నాయకత్వాన్ని అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను శీభరాణి–అనీల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బుద్దె పెద్దన్న, రైతు రాజు, గాదె రాము, బిజిలి సంపత్, అఖిల్‌తో పాటు వికలాంగుల కాలనీ వాసులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20250525-WA0035

Tags:

Post Your Comments

Comments

Latest News

అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం  అధైర్య పడాల్సిన అవసరం లేదు  సముచిత స్థానం కల్పిస్తాం 
-సింగపురం ఇందిరకు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నుండి పిలుపు  -మీనాక్షి నటరాజన్ ను కలిసిన సింగపురం ఇందిరా  స్టేషన్ ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: స్టేషన్ ఘనపూర్...
ఇందిరా గాంధీని మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలి 
పేదల పాలిట వరం సిఎంఆర్ఎఫ్ 
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకే డెయిరీ ఏర్పాటు
పరకాల మహిళా డెయిరీ, శిక్షణ కేంద్రాలపై సమీక్ష
నకిలీ విత్తనాలు,ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి
కొండపర్తి చెరువు కట్టు కాలువ మరమ్మత్తు పనులు ప్రారంభం