సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

రాష్ట్రసాగునీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు.

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామ శివారులోని దేవాదుల పంప్ హౌస్ స్టేషన్ ను రాష్ట్ర సాగునీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణా సమాచార శాఖ మంత్రి పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి,ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి,నాయని రాజేందర్ రెడ్డి, మామిడాల యశస్విని రెడ్డి,పల్లా రాజేశ్వర్ రెడ్డి,కె ఆర్ నాగరాజు,మేయర్ గుండు సుధారాణి లతో కలిసి శనివారం రోజున పరిశీలించారుWhatsApp Image 2025-05-03 at 9.13.48 PM. అనంతరం దేవాదుల పంపు హౌస్ పనుల పురోగతి ఇతర అంశాలపై సాగునీటిపారుదల శాఖ అధికారులతో మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే దేవాదుల పంప్ హౌస్ ను సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సాగునీరు,ధాన్యం కొనుగోలు ఇతర అంశాలపై సమీక్షించేందుకు జిల్లాకు వచ్చినట్లు తెలియజేశారు.దేవాదుల మూడు పైపులైన్ల పంపులను ఆన్ చేసి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.దేవాదుల పంపు హౌస్ నుండి ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న దేవాదుల పైపులను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్,సాగునీటి పారుదల శాఖ ఈన్సీ అనిల్ కుమార్,సి ఈ అశోక్ కుమార్,హనుమకొండ జిల్లా కలెక్టర్

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .