డబుల్ బెడ్‌రూమ్‌లో మహిళలు ఆరు గ్యారెంటీల అమలు చేయాలని  సీఐటీయూ

డబుల్ బెడ్‌రూమ్‌లో మహిళలు ఆరు గ్యారెంటీల అమలు చేయాలని  సీఐటీయూ

నాగారం, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మహిళలతో సమావేశం  సీఐటీయూ కీసర మండల నాయకులు బంగారు నర్సింగరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలకు వాగ్దానం చేసిన నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే సరఫరా చేయడం, అలాగే డబుల్ బెడ్‌రూమ్ గృహ లబ్ధిదారులందరికీ జీరో కరెంట్ బిల్లు పథకం అమలు చేయాలని కోరారు.

అదేవిధంగా, మహిళల కోసం స్వశక్తి, స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారికి సబ్సిడీ రుణాలు అందజేయాలని అన్నారు. డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల పునరుద్ధరణకు సంబంధిత మున్సిపల్ అధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా మహిళా పొదుపు గ్రూపులను కూడా ఏర్పాటు చేయాలని నర్సింగరావు పిలుపునిచ్చారు.

ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 25వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ధర్నాలో మహిళలంతా, ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ గృహ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ప్రాంతీయ మహిళలు విజయలక్ష్మి, యాదమ్మ, సాహిన, రుక్సానా, శకుంతల, సైదమ్మ, వర్ష తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు): మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము...
డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!
సత్తుపల్లిలో గణపతి పూజల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు.
కాలి దప్పి మాట్లాడుతున్న కడియం 
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం
అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు
బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం