అన్నపూర్ణ కాలనీ పార్క్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేయాలని కార్పొరేటర్ కు వినతి 

అన్నపూర్ణ కాలనీ పార్క్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేయాలని కార్పొరేటర్ కు వినతి 

నాచారం, ఆగస్ట్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లోని రాఘవేంద్ర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే పోచమ్మ గుడి నుండి అన్నపూర్ణ కాలనీ పార్క్ రోడ్డు వరకు ఇంకా సిమెంట్ రోడ్డు వేసే పనులు మిగిలి ఉన్నాయి.

ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌ను వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

కార్పొరేటర్ మాట్లాడుతూ, మిగిలిన రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో వై. యాదగిరి, మారయ్య, అశోక్, ఎం. యాదగిరి, పెంటయ్య, ప్రభాకర్, రాజ్‌కుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్ చారి, ఎన్. యాదయ్య, ఐలాపురం, పరమేష్, పరశురాముడు, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .