ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.

చెల్లిని కోల్పోయిన రిషికా కన్నీటి ముద్ద.

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.

సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు):

మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు వేసి చిన్నారి ప్రాణాలు బలిగొన్న సంఘటన అందరినీ కలచివేసింది.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం,  గ్రామానికి చెందిన గౌర గోపి (28), మౌనిక (25) దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు రిషికా (8), లోహిత (5)తో కలిసి ఇంట్లో నేలపై నిద్రిస్తుండగా, గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కట్ల పాము (విషసర్పం) ఇంట్లోకి చొరబడి చిన్నారి లోహితతో పాటు తల్లి మౌనికను కాటు వేసింది.

సమయం వృథా చేయకుండా కుటుంబ సభ్యులు పామును చంపి, బాధితులను 108 వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ చిన్నారి లోహిత (5) మృతి చెందింది. పరిస్థితి విషమంగా మారిన తల్లి మౌనికను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. లోహిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీలో ఉంచారుIMG-20250828-WA0005

 

ఈ ఘటనతో అక్క రిషికా (8) చెల్లిని కోల్పోయి కన్నీటి ముద్దయింది. గ్రామమంతా విషాద ఛాయలు కమ్ముకున్నాయి. గ్రామస్తులు లోహిత మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .