గోకుల్ నగర్ భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవు: బీజేపీ నేత రవీందర్ సాగర్
మల్లాపూర్, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్లో జరుగుతున్న భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మేడ్చల్ జిల్లా కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీందర్ సాగర్ డిమాండ్ చేశారు.
గోకుల్ నగర్లో అమాయక ప్రజలు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లపై కొంతమంది కబ్జాదారులు కన్నేసి, నకిలీ జిపిఏ పత్రాలతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం ఈ వ్యవహారంలో తక్షణం జోక్యం చేసుకోవాలని, లేకపోతే కోర్టును ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు.
జయప్రద కాలనీలో కూడా ప్రభుత్వ పార్క్ స్థలం, షాపింగ్ కాంప్లెక్స్ స్థలాలను అక్రమంగా కబ్జా చేసి అమ్మిన ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రవీందర్ సాగర్, త్వరలో బండారం బయటపెడతానని అన్నారు.


Comments