మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జనరల్‌ సెక్రటరీగా హన్మకొండ శ్రీకాంత్

హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన జర్నలిస్ట్‌కు కీలక బాధ్యత

మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జనరల్‌ సెక్రటరీగా హన్మకొండ శ్రీకాంత్
టిఎంజెఎఫ్ హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీగా ఎన్నికైన జర్నలిస్ట్ శ్రీకాంత్

-ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ ఆదేశాల మేరకు నియామకం

-స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బొల్లెపాక రాజేష్ అధికారిక ప్రకటన

-నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన సెక్రటరీ శ్రీకాంత్

హనుమకొండ,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు): 

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జనరల్ సెక్రటరీగా హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ శ్రీకాంత్‌ను నియమించినట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకం ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గులనాగేందర్ ఆదేశాల మేరకు జరిగినట్లు ఆయన వివరించారు.

శ్రీకాంత్ గత కొన్నేళ్లుగా జర్నలిజంలో చురుకుగా కొనసాగుతూ ప్రభుత్వం, ప్రతిపక్షాలపై విశ్లేషణాత్మక కథనాలు రాశారు. విద్య, ఆరోగ్య రంగాలపై లోతైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికలు సమర్పించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ నిబద్ధత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్‌ను నియమించినట్లు ఫోరం ప్రకటించింది.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ  “జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారమే నా తొలి ప్రాధాన్యం. వారి హక్కులు, భద్రత, సంక్షేమం కోసం అన్ని స్థాయిల్లో పోరాడతాను. అదేవిధంగా మాదిగ కమ్యూనిటీని వేధిస్తున్న సామాజిక, ఆర్థిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం స్పందించేలా కృషి చేస్తాను. కమ్యూనిటీ అభివృద్ధి, జర్నలిస్టుల బలోపేతం కోసం నేను ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.అదేవిధంగా తనకు ఈ బాధ్యత రావడానికి సహకరించిన రాష్ట్ర నాయకులు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెండ్యాల సుమన్, జిల్లా అధ్యక్షుడు సందేల రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .