లచ్చన్నగూడెంలో విద్యుత్ శాఖ “పొలం బాట” కార్యక్రమం.
Views: 39
On
సత్తుపల్లి,ఆగస్టు 23(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం “పొలం బాట” కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది రైతులకు కేపాసిటర్ల ప్రాముఖ్యత, విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోటార్లు నడిపేటప్పుడు భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు 1912 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంకారావు (ఏఈ), వెంకటేశ్వరరావు(లైన్ మెన్), గంధం వెంకటేశ్వరరావు (లైన్ మెన్), సాయి కుమార్ (అసిస్టెంట్ లైన్ మెన్), రాజేష్ (అసిస్టెంట్ లైన్ మెన్) పాల్గొని గ్రామస్థులతో మమేకమయ్యారు.
గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments