పానుగల్ గ్రామానికి చెందిన ఎనుముల కిష్టయ్య హత్య

కేసును చేదించిన పోలీసులు 

పానుగల్ గ్రామానికి చెందిన ఎనుముల కిష్టయ్య హత్య

వనపర్తి,ఆగస్టు23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పానగల్ గ్రామానికి చెందిన ఎనుముల కిష్టయ్య హత్య కేసును పానుగల్ పోలీసులు సేవించారు.వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు, తన భార్య విడిచి వెళ్లడానికి కిష్టయ్య కారణమని అనుమానం, అలాగే డబ్బులు దొంగలించి బైక్ కొనాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం హత్య చేశాడు, అని చెప్పారు.ఆగస్టు 20న రాత్రి కిష్టయ్య ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో రాములు అతని తలపై పప్పుగుత్తితో కొట్టి, అనంతరం గొంతు పట్టి హత్య చేశాడు. అనంతరం జేబులో ఉన్న రూ.40,000 నగదు దోచుకొని, నేరానికి ఉపయోగించిన పప్పుగుత్తి కాడను కాలువలో పారవేశాడు. దొంగిలించిన డబ్బులో రూ.6,000 ఖర్చు చేసి, రూ.33,000 ఇంట్లో దాచిపెట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. (23-08-2025) ఉదయం గ్రామంలో తిరుగుతున్న రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి మిగిలిన నగదు, రక్తపు మరకలున్న బట్టలు, పప్పుగుత్తి కాడను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ఛేదనలో వనపర్తి సీఐ కృష్ణయ్య, పానుగల్ ఎస్సై శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ పేర్కొన్నారు. వీరిని ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేస్తామని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .