డాక్టరేట్ పొందిన సతీష్ యాదవ్ను ఘనంగా సత్కరించిన సాహితీ కళావేదిక సభ్యులు
వనపర్తి,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ప్రజాసేవలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సాహితీ కళావేదిక సభ్యులు, ప్రజా సంఘాలు ఆయనను ఘనంగా సత్కరించాయి.
ఆదివారం ఉదయం సాహితీ కళావేదిక సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు సతీష్ యాదవ్ నివాసానికి వెళ్లి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందించారు. కళాకారులు కవితలు చెబుతూ, పాటలు పాడుతూ సతీష్ యాదవ్ సేవలను కొనియాడారు.
సమాజాభివృద్ధి లక్ష్యం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా వనపర్తిని కాపాడుతూ, సమాజ అభివృద్ధికి కృషి చేద్దాం” అని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సాహితీ కళావేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్, కవి బై రోజు చంద్రశేఖర్, గౌరవ డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయుడు కంటి నిరంజనయ్య, వనపర్తి గద్దర్ రాజారామ్ ప్రకాష్, కవి సత్తార్, బహుజన వేదిక అధ్యక్షుడు గంధం నాగరాజు, జైభీమ్ సేన అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు డి. రాములు, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Comments