సత్తుపల్లిలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం!
డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ.
డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.
సత్తుపల్లి, ఆగస్టు 23(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలంలో యువసేవ సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల అనేక కుటుంబాలు క్షీణిస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి నేతృత్వంలో గత 10 నెలలుగా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన సత్తుపల్లి నియోజకవర్గంలో డ్రగ్స్ వాడకం గణనీయంగా తగ్గిందని తెలిపారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సమాజం నుంచి వాటిని పూర్తిగా తరిమేయడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.యువత, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.
కార్యక్రమంలో సత్తుపల్లి–వేంసూరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు, చల్లగుల నరసింహ రావు, గాదె చెన్నారావు, కమల్ పాషా, యువసేవ సమితి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments