గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసు, మున్సిపల్ అధికారులు సమావేశం
మల్కాజిగిరి సీఐ బి. సత్యనారాయణ
ఏసిపి చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ జకియా సుల్తానా,
మల్కాజిగిరి, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):
మల్కాజిగిరి శుభం కన్వెన్షన్ హాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి సీఐ బి. సత్యనారాయణ, ఏసీపీ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ జకియా సుల్తానా, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ జకియా సుల్తానా మాట్లాడుతూ శానిటేషన్, నీటి సరఫరా, లైటింగ్ తదితర సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని నిమజ్జన కార్యక్రమాలు సజావుగా సాగేందుకు అధికారులు, నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
సీఐ బి. సత్యనారాయణ మండపాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, విద్యుత్ కనెక్షన్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పోలీసులు ఇచ్చే సూచనలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు ముగ్గురూ ఒకే స్వరంతో పండుగ అనేది ఒక్క సమితి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేస్తూ, ప్రజల సహకారంతో మల్కాజిగిరి గణపతి నవరాత్రులు శాంతియుతంగా, ఐక్యతతో ఘనంగా జరగనున్నాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.


Comments