డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం

డాక్టర్లను కలిసిన జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

 సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 30వ తేదీ వరకు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా " నైతికతే నిజమైన స్వేచ్ఛ " అంశంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలలో భాగంగా శనివారం నాడు ( రెండో రోజు) కూడా మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో పలు ఆస్పత్రులను సందర్శించి డాక్టర్లకు నైతికతే నిజమైన స్వేచ్ఛ అంశంపై స్వచ్ఛ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను వారికి అందజేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ మహిళ విభాగం ఖిల్లా అధ్యక్షురాలు ఆస్పియా అంజుమ్ మాట్లాడుతూ మానవులలో నైతిక విలువలు పతనం కావడానికి భయభక్తులు లోపించడమే కారణమన్నారు. ప్రస్తుత సమాజం నైతిక సంక్షోభంలో చిక్కుకొని అశాంతి , ఆలజడు లకు గురవుతుందన్నారు .సమాజంలో మార్పు కోసం మన అందరం కృషి చేయాల్సిన అవశ్యకత ఎంతో ఉందని చెప్పారు .తాము నిర్వహించే కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జమాతే ఇస్లామీ హింద్ మహిళ విభాగం క్యాంపెయిన్ కన్వీనర్ హాజీర సదఫ్, సభ్యులు, నూరి హప్ష,ఫైజా ఇరం తదితరులు పాల్గొన్నారు.

జమాఅతె ఇస్లామీ హింద్ ఇంద్రనగర్ శాఖ అధ్యక్షురాలు హుసేన్ బీ. ఆధ్వర్యంలో స్కూళ్లను సందర్శించి ప్రత్యేకంగా రూపొందించిన కరపత్రాలను అందించి క్యాంపెయిన్ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలకు నైతిక విలువల బోధించాలని టీచర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు జహరా ఫాతిమా, మొమినా తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న