గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చిలకనగర్, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):

చిలకనగర్ డివిజన్ లో ప్రశాంత్ నగర్ రిలయన్స్ మార్ట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యువత ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి కోసం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన మటన్, చికెన్ అందించడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, బిఆర్ఎస్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, బాలకృష్ణ గౌడ్, బజార్ జగన్నాథ్ గౌడ్, రామాంజనేయులు, శ్యామ్, ఎండి అసద్, మార్క శీను, ఫారూఖ్, ఉబేద్, రాకేష్, తిరుపతి సాయికిరణ్ ప్రవీణ్, వాసు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .