గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

చిలకనగర్, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):

చిలకనగర్ డివిజన్ లో ప్రశాంత్ నగర్ రిలయన్స్ మార్ట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యువత ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి కోసం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన మటన్, చికెన్ అందించడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, బిఆర్ఎస్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, బాలకృష్ణ గౌడ్, బజార్ జగన్నాథ్ గౌడ్, రామాంజనేయులు, శ్యామ్, ఎండి అసద్, మార్క శీను, ఫారూఖ్, ఉబేద్, రాకేష్, తిరుపతి సాయికిరణ్ ప్రవీణ్, వాసు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు): మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము...
డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!
సత్తుపల్లిలో గణపతి పూజల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు.
కాలి దప్పి మాట్లాడుతున్న కడియం 
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం
అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు
బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం