బ్యాంకింగ్‌ చట్టాల్లో సవరణలు చేస్తాం.. 

ఆర్బీఐ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

బ్యాంకింగ్‌ చట్టాల్లో సవరణలు చేస్తాం.. 

డెస్క్ ,తెలంగాణ ముచ్చట్లు:

చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న బ్యాంకింగ్‌ చట్టాల్లో (Banking Acts) సవరణలు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) అన్నారు. అదేవిధంగా నామినీ చట్టాల్లో కూడా మార్పులు తీసుకువస్తామని ఆమె ప్రకటించారు. ఈ మార్పుల ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థ కస్టమర్‌ ఫ్రెండ్లీగా మారుతుందని చెప్పారు.

శనివారం ఢిల్లీలో జరిగిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ల సమావేశంలో నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకులకు ఆమె పలు సూచనలు చేశారు. అన్ క్లెయిమ్డ్‌ డిపాజిట్లపై దృష్టి సారించాలని సూచించారు. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉన్నాయని అన్నారు. కాగా అనేక ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు.

ఈ క్రమంలోనే శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు సంబంధించిన అన్ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు పెరగటంపై కూడా మోదీ సర్కార్ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరుకుంది.

ఈ నేపథ్యంలోనే ఒక ఖాతాకు కస్టమర్లు నలుగురు నామినీలను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లు 2024 నిర్ణయించింది. దీనికి ముందు వరకు ఒక ఖాతాకు కేవలం ఒక నామినీని మాత్రమే కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త చట్టాలు అమలులోకి వస్తే తదనుగుణంగా నామినీలను వినియోగదారులు పెంచుకోవచ్చు.

ఈ మార్పు ద్వారా సదరు ఖాతాదారులు మరణిస్తే డిపాజిట్లు లేదా ఇతర మెుత్తాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి చట్టపరంగా నామినీలకు అవకాశం కల్పించబడుతుంది. దాంతో భారీగా పెరుగుతున్న అన్ క్లెయిమ్డ్ డిపాజిట్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఏకకాలంలో 4 చట్టాలను సవరించేందుకు ప్రయత్నించటాన్ని ఆర్ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న