స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?

స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. అయితే ప్రతీ రోజూ వేలల్లో లావాదేవీలు చేసే యాప్స్‌ఉండే ఫోన్‌ ఎక్కడైనా పడిపోయినా, లేదా ఎవరైనా దొంగలించినా అప్పుడు పరిస్థితి ఏంటి.? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా.? ఒకవేళ నిజంగానే మీ ఫోన్‌ పోయిందనుకోండి. మీ ఫోన్‌లోని యూపీఐ ఐడీలను బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది
 ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఎన్నో రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని బ్లాక్‌ ఎలా చేయాలి.? మన దగ్గర ఫోన్‌ ఉంటే ఇట్టే యాప్స్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఫోన్‌ లేకపోతే పరిస్థితి ఏంటి.? ఇందుకోసం కూడా ఓ మార్గం ఉంది. యూపీఐ ఐడీని నిమిషాల్లోనే సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టోల్‌ ఫ్రీ నెంబర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటికి కాల్‌ కాసి కొన్ని వివరాలు తెలిజేయడం ద్వారా మీరు మీ యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ కూడా ఎక్కువవుతోంది. యూపీఐ ఐడీలను హ్యాక్‌ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారు కూడా ఈ నెంబర్లకు కాల్ చేసిన యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకుకోవచ్చు.

ఎలా బ్లాక్‌ చేయాలంటే..

ఒకవేళ మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు 1800-419-0157 నెంబర్‌కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పేటీఎమ్‌ ఉపయోగిస్తున్నట్లయితే 01204456456 నెంబర్‌కు కాల్‌ చేయాలి. ఇవి టోల్‌ ఫ్రీ నెంబర్స్‌. ఈ నెంబర్లకు కాల్ చేసిన తర్వాత కస్టమర్ కేర్‌ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సదరు యూపీఐ ఐడీ మీదేనా కాదా.? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి అవతలివైపు నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పడం ద్వారా మీ యూపీఐ ఐడీని సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీకి జెండా ఊపి రైలును ప్రారంభించిన 
చర్లపల్లి, తెలంగాణ ముచ్చట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఈనెల 7న తలపెట్టిన ఛలో...
మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు గట్టు రాజు 
భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి నందుకు కార్పొరేటర్ కు సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. 
బోనాల పండుగ ఉత్సవాల లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దమ్మాయిగూడ జాతీయ మాల మహానాడు సంఘం అధ్యక్షులుగా 
50వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బాబా సాహెబ్ సన్నిధిలో 
మల్లాపూర్ అంబేద్కర్ సంఘం బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న