18ఏళ్ల బెస్లీని కబళించిన సింగరేణి పొగ.

పొగ నియంత్రణపై సింగరేణి తక్షణ చర్యలు తీసుకోవాలి.

18ఏళ్ల బెస్లీని కబళించిన సింగరేణి పొగ.

సత్తుపల్లి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

కిష్టారం గ్రామానికి చెందిన 18ఏళ్ల బీటెక్ విద్యార్థిని బెస్లీ, ప్రతిరోజూ సింగరేణి సైల్లో బంకర్ నుంచి వచ్చే విషపూరిత పొగను భరిస్తూ చదువుకు వెళ్లేది. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసి చదివించిన ఒక్క కూతురు అయిన బెస్లీ, ఆ పొగ కారణంగా తీవ్రమైన శ్వాస సమస్యతో చివరిగా “అమ్మ… ఊపిరి ఆడడం లేదు…” అని చెప్పి తల్లికన్నుల ముందే ప్రాణం కోల్పోయింది.

నెలలుగా గ్రామం పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పరిష్కారం కనిపించకపోవడంతో, బెస్లీ మృతి గ్రామాన్ని వేదనలో ముంచేసింది. ఆమె అంత్యక్రియల సమయంలో తల్లి రోదన గ్రామమంతటా హృదయాలను కదిలించింది.

ఈ ఘటన తర్వాత గ్రామస్తుల డిమాండ్ ఒక్కటే—
సింగరేణి వెంటనే పొగ, దుమ్ము నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. ఇకపై ఎవరి ప్రాణం పోకూడదన్నదే వారి విజ్ఞప్తి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .