మావోయిస్టు నేత హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇద్దరిపై కేసు నమోదు 

మావోయిస్టు నేత హిడ్మా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇద్దరిపై కేసు నమోదు 

వేలేరు,22 నవంబర్‌(తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం సోడాషాపల్లి గ్రామంలో మావోయిస్టు నేత హిడ్మా ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది. ఇటీవల జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణ సమాచారాన్ని తెలియజేస్తూ తుపాకి పట్టుకున్న హిడ్మా చిత్రంతో కూడిన ఫ్లెక్సీని చర్చి గోడపై అతికించినట్లు గ్రామస్థులు గమనించారు.

ప్రభుత్వం నిషేధించిన వ్యక్తి చిత్రాన్ని ప్రదర్శించడం చట్టవ్యతిరేక చర్యగా పరిగణిస్తూ గ్రామానికి చెందిన సురేష్, బుచ్చయ్యలపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు. ఇటువంటి చర్యలు నక్సలిజాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలుగా భావించి కఠినంగా వ్యవహరించబడతాయని ఆయన హెచ్చరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .