రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

రిక్వెల్ ఫోర్డ్ స్కూల్లో వ్యాసరచన పోటీ

రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన

కీసర, జనవరి 17 (తెలంగాణ ముచ్చట్లు):

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026” కార్యక్రమంలో భాగంగా, కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం రాంపల్లి గ్రామంలోని రిక్వెల్ ఫోర్డ్ స్కూల్ లో వ్యాసరచన పోటీ నిర్వహించారు.ఈ పోటీలో హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.వ్యాసరచనకు
“ఒక చిన్న ట్రాఫిక్ ఉల్లంఘన ఒక ప్రాణాన్ని అంతం చేయగలదు”,“రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత”అనే అంశాలను విద్యార్థులకు నిర్దేశించారు.ఈ సందర్భంగా కీసర పోలీసులు విద్యార్థులతో మాట్లాడుతూ,హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అలాగే తప్పుదారి డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ద్వారా కుటుంబ స్థాయిలో ప్రవర్తనా మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు కీసర పోలీసు సిబ్బంది హాజరై సహకరించారు.ఈ సందర్భంగా కీసర పోలీసులు మాట్లాడుతూ, రోడ్డు భద్రతను ప్రజా ఉద్యమంగా మార్చడమే “అరైవ్ అలైవ్ క్యాంపైన్–2026” ముఖ్య లక్ష్యమని, విద్యార్థులు ట్రాఫిక్ నియమాలను తాము పాటించడంతో పాటు, ఇతరులను కూడా పాటించేలా ప్రేరేపించాలని పిలుపునిచ్చారు.IMG-20260117-WA0064

Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన పెద్దమందడిలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థల పరిశీలన
పెద్దమందడి,జనవరి27(తెలంగాణ ముచ్చట్లు): పెద్దమందడి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మంగళవారం స్థల పరిశీలన చేపట్టినట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎం. ఈశ్వర్ తెలిపారు....
పేద కుటుంబానికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి
పారదర్శకంగా మునిసిపల్ ఎన్నికల నిర్వహణ.. 
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వెల్టూర్ గ్రామ నాయకులు
కీసరలో ‘అరైవ్ అలైవ్–2026’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
వాజపేయి నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి, సఫిల్‌గూడ సబ్‌వే పనులకు శంకుస్థాపన
పామాయిల్ తోటల్లో పసుపు సాగు విజయవంతం.!