సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
Views: 28
On
కీసర, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)
రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల నిరోధక చర్యలు మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు ఎం.జె.పి.టి.బి.సి. డబ్ల్యూ.ఆర్.ఇ.ఐ.ఎస్ బాలుర వసతి గృహం, బోగారం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. అంజనేయులు, సెక్టార్ ఎస్ఐ డి. వెంకటేష్, అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సుమారు 200 మంది విద్యార్థులు హాజరైన ఈ సమావేశంలో, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పద్ధతులు, వాటి ప్రభావం, నివారణ చర్యలు, జాగ్రత్తలు గురించి విద్యార్థులకు వివరించారు. యువత సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఫ్రాడ్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments