గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురుకుల పాఠశాలో పుస్తక ప్రదర్శన

గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురుకుల పాఠశాలో పుస్తక ప్రదర్శన

వనపర్తి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా వనపర్తి మండలం చిట్యాల గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి మాట్లాడుతూ..చినిగిన చొక్కా అయినా తొడుక్కో… ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పుస్తకాల విలువను ఉదహరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠన అలవాటు పెంపొందించుకోవాలని, రోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులపై పుస్తకాలు, విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు, వినోద పుస్తకాలు, ఆధ్యాత్మిక రచనలు, కవితలు–కథల పుస్తకాలను ప్రదర్శించారు. విద్యార్థులు పుస్తకాలను ఆసక్తిగా వీక్షించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంతి, లైబ్రేరియన్ డా. రవి, ఏటీపీ పవన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .